ఆంధ్రప్రదేశ్‌

తుపాను హెచ్చరికతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, డిసెంబర్ 15: తూర్పుగోదావరి జిల్లాపై పెథాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తుపానును ఎదుర్కొనేందుకు శనివారం అధికారులతో జిల్లా కలెక్టరేట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. తుపాను అల్లవరం మండలం ఓటలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్యలో తుపాను తీరందాటే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు ఇటీవల తిత్లీతుపాన్ సమయంలో స్పెషల్ అధికారులుగా పనిచేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. కోనసీమ ప్రాంతంలో 50కిపైగా పునరావాస కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్వావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను జిల్లాలో తీరం దాటే సమయంలో గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్న కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా సెల్ టవర్లవద్ద జనరేటర్లను ఏర్పాటుకు ఏజెన్సీలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన తక్షణం కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం కలగకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లను ఉంచి రానున్న ఆరు, ఏడురోజుల పాటు అవి నిరంతరాయంగా పనిచేసేటట్లు కృషిచేయాలని కోరారు.
తుపాను తాకిడికి గురయ్యే 12తీర మండలాల్లో టెక్నీషియన్లు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేయాలని కలెక్టర్ మిశ్రా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొబైల్ కనెక్టవిటీకి ఎటువంటి అంతరాయం లేకుండా అవి నిరంతరాయంగా పనిచేసే విధంగా ఈవారం రోజులు అధికారులు అందరూ సమిష్టిగా కృషిచేయాలన్నారు.
మొబైల్ 1జిబి సెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తక్షణం తరలించాలని కలెక్టర్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసి-2 సిహెచ్ సత్తిబాబు, డీఆర్వో సుబ్బలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.