ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి ప్రధాని ద్రోహం చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ద్రోహం చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్రోహం చేశారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ అన్నారు. శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ముందుకు వస్తే వారు కమిషన్ ఇవ్వరని జిఎంఆర్‌కు కట్టాబెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందన్నారు. కాగా, ఇక్కడ ఎంపీగా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పటికీ దేనికి నోరు మెదపడం లేదని, అలాంటపుడు మంచివ్యక్తి అయితే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియాగాంధీ ఇద్దరూ ఆంధ్రులకు ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలను చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకు రావడం లేదన్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ బీజేపీ తన అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని విలేఖరులు అడగ్గా బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. వచ్చే నెల 6న ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, ఏయే ప్రాంతాల్లో పర్యటించనున్నదీ మరో రెండు రోజుల్లో స్పష్టం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నిమ్మక జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.