ఆంధ్రప్రదేశ్
పిడుగురాళ్లలో స్వల్ప భూప్రకంపనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 January 2019
పిడుగురాళ్ల, జనవరి 12: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
పట్టణంలో శనివారం సాయంత్రం సుమారు 3.25 నుండి 6 గంటల మధ్య భూమి నాలుగుసార్లు కంపించింది. ఆరేళ్ల క్రితం ఒకసారి, మూడేళ్ల క్రితం ఒకసారి ఇలా భూమి కంపించినట్లు ఈసందర్భంగా స్థానికులు గుర్తుచేశారు. తరచూ ఇక్కడ భూప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో అధికారులు, శాస్తవ్రేత్తలు వెల్లడించాలని పట్టణవాసులు కోరుతున్నారు. భూప్రకంపనలతో పట్టణంలోని పాటిగుంతలు, లెనిన్ నగర్, స్వర్ణపిచ్చయ్య కాలనీ వాసులు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.