ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌ది గాంధీ..బీజేపీది గాడ్సే సిద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: కాంగ్రెస్ పార్టీది మహాత్మా గాంధీ సిద్ధాంతం అయితే, బీజేపీది హంతకుడు గాడ్సే సిద్ధాంతమని ప్రదేశ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. వచ్చే ఎన్నికలు గాంధీ వారసులు, గాడ్సే వారసుల మధ్య జరగబోతున్నాయన్నారు. మోదీ శకం ముగిసి, రాహుల్ శకం ఆరంభం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నాయకులకు సిద్ధాంతం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. గతంలో వాజపేయి ప్రభుత్వం వెలిగిపోతోందంటూ జరిగిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన తీరును గుర్తించాలన్నారు. వాజపేయి కంటే మోదీ గొప్పవాడా? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.