ఆంధ్రప్రదేశ్‌

యువత శక్తియుక్తులు అభివృద్ధికి ఉపయోగపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: యువత భాగస్వామ్యంతో, వారి శక్తియుక్తులతో రాష్ట్భ్రావృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర యువజన సర్వీసులు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో రాష్ట్రంలోని యువతీ, యువకులు పాలుపంచుకునేలా చేయాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ద్వారా యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువశక్తిని అద్భుత శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో పథకంలో భాగంగా 4.36 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పంచేలా శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన అనుభవం, దూరదృష్టి, దృఢ సంకల్పంతో ఆదుకోవనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 12రకాల పింఛన్లు అమలవుతున్నాయని మంత్రి రవీంద్ర వివరించారు. సమావేశంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రకుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గనె్న వెంకట నారాయణ ప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పాల్గొన్నారు.