ఆంధ్రప్రదేశ్‌

మోదీ ప్రభుత్వం కక్ష కట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టిందని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల 13వ రాష్ట్ర మహాసభలకు హాజరైన మంత్రి కళా వెంకట్రావు ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి కేసులో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటోందన్నారు. దీంతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. కోడి కత్తి కేసును ఎన్‌ఐఏకు అప్పగించాల్సిన అవసరం లేదని, ఇందులో రాజకీయ దురుద్దేశ్యం ఉందని ఆరోపించారు. అందువలనే తాము దీనిని ప్రతిఘటిస్తున్నామని అన్నారు. జగన్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించేటంత పెద్ద కేసు కాదన్నారు. ఎన్‌ఐఏ వంటి సంస్థ పెద్దపెద్ద నేరాలపై దృష్టిపెట్టాలన్నారు. చట్టం దృష్టిలో అంతా సమానమేనన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగా వ్యవస్థను బలహీనపరిస్తే కేంద్రంపై పోరాటం తప్పదని మంత్రి హెచ్చరించారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కళా వెంకట్రావు