ఆంధ్రప్రదేశ్‌

బయో వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల సమర్థ నిర్వహణ కీలకమని, నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ అన్నారు. పీసీబీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో బయో మెడికల్ వేస్ట్ సురక్షిత నిర్వీర్యంలో ఎదురయ్యే అంశాలు-సవాళ్లపై విశాఖలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాల వారీగా ఆసుపత్రుల నుంచి ఆసుపత్రుల వ్యర్థాలను సేకరిస్తున్న సంస్థలు వాటిని సక్రమంగా నిర్వీర్యం చేస్తున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సమర్ధ నిర్వహణకు గాను ప్రత్యేక యాప్ రూపొందించనున్నట్టు వెల్లడించారు. వ్యర్ధాలు సేకరించే సంస్థలు వీటిని ఎక్కడకు తరలిస్తున్నాయి, ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదీ పరిశీలించి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కడప, విజయనగరం మినహా అన్ని జిల్లాలోనూ ఆసుపత్రి వ్యర్థాలను సేకరించి నిర్వహించే ఫెసిలిటేటర్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే 10వేల పడకలు దాటిన జిల్లాల్లో రెండో ఫెసిలిటేటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి వ్యర్థాలను సేకరించే సంస్థలు ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాయని, వసూలు చేస్తున్న ధరలు చిన్న, మధ్యతరగతి ఆసుపత్రులు, క్లినిక్‌లకు భారంగా మారుతోందన్న అంశంపై స్పందిస్తూ ధరలను స్థిరీకరించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏకమొత్తంగా రోజుకు, పడక ఒక్కంటికీ రూ.6 వసూలు చేస్తున్నారన్నారు. అయితే దీనిపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో శ్లాబుల వారీగా రేట్లు నిర్ణయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ధరల అంశాన్ని సాంకేతిక కమిటీ పరిశీలించి నిర్ణయిస్తుందన్నారు. ఆసుపత్రి వ్యర్థాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. చిన్న, మధ్యతరహా ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొంతమందికి శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా వీటిని వర్గీకరించి ఫెసిలిటేటర్‌కు ఇచ్చేలా చేస్తామన్నారు. ఆసుపత్రి వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ, అమరావతి ప్రాంతాలు మెడికల్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ సమక్రమంగా ఉండాలన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న పీసీబీ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్