ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక సలహా మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయిలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ సలహామండలిని ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేసింది. ఈ మండలికి చైర్‌పర్సన్‌గా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించారు. కన్వీనర్‌గా రాష్ట్ర ప్రాజెక్టు సలహాదారు ఉంటారు. సభ్యులుగా పరిశ్రమల శాఖ కమిషనర్, సిఐఐ ప్రతినిధి, శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు, బెటర్ కాస్టింగ్స్ సివోఇ జమ్ముల ఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఇంజనీరింగ్ డిజైన్స్ సీనియర్ జనరల్ మేనేజర్ గల్లా కృష్ణమూర్తి నాయుడు, యుయుఆర్‌ఎంఐ సిస్టమ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శాంతి స్వరూప్ మేడసాని, ఇంద్రావతి పవర్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ జె చుండ్రు, గ్లోబల్ ఎనర్జీ కనె్సల్టింగ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి కృష్ణారావును నియమించారు. అకడమిక్, ఇండస్ట్రీస్ మధ్య అవగాహన, భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ మండలి కృషి చేస్తుంది.