ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: బొత్స
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 July 2016
హైదరాబాద్, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు వేదికగా వాగ్దానం చేశారని, ఈ బాధ్యత పార్లమెంటుకే ఉందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలకు అతీతంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఈ హామీని నెరవేర్చాలిన బాధ్యత ఉందన్నారు. దీనిపై ప్రత్యేకంగా బిల్లు అవసరం లేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీకి విలువ లేకపోతే ప్రజలకు వ్యవస్ధంటే విశ్వాసం పోతుందన్నారు. గురువారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధనకు వైకాపా రాష్ట్రంలో ఉద్యమాలు చేసిందన్నారు.