ఆంధ్రప్రదేశ్‌

‘జగన్ స్క్రిప్ట్‌నే వల్లెవేస్తున్న ఆమంచి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: పార్టీలు మారడాన్ని ఎవరూ తప్పుపట్టరని, అయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారేముందు వాస్తవాలు మాట్లాడకుండా, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ని అప్పజెప్పడమనేది చాలా దురదృష్టకరమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చీరాలలో జరిగిన అభివృద్ధి పనులను ఆమంచి గుర్తిస్తే మంచిదన్నారు. ఈ నాలుగేళ్లలో చీరాల నియోజకవర్గంలో మొత్తం రూ. 875 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1000 మందికి రూ. 6.11 కోట్లు పంపిణీ చేశారన్నారు. వారంతా ఏ కులస్థులో ఆమంచి సమాధానం చెప్పాలన్నారు.