ఆంధ్రప్రదేశ్‌

ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ధనుంజయరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: సీనీయర్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయరెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శ్రీకాకుళం కలెక్టర్‌గా సేవలు అందించిన ధనుంజయ రెడ్డి ఇటీవల బదిలీల్లో భాగంగా ఏపీటీడీసీ ఎండీగా నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన సచివాలయానికి చేరుకుని పర్యాటక, భాషా సాంస్కృతిక, పురవస్తుశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా కలిసారు. ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతులు తీసుకున్న నేపథ్యంలో ధనుంజయరెడ్డి మాట్లాడుతూ పర్యాటక ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో తనవంతు కృషి చేస్తానని, ఈ క్రమంలో సిబ్బంది సహకారం ఆశిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు లక్ష పర్యాటక అతిథి గదుల లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.