ఆంధ్రప్రదేశ్‌

తాడేపల్లిలో పీఆర్‌ఆర్‌డీ కమిషనరేట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం కృషిచేస్తోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో ఏర్పాటుచేసిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్‌ఆర్‌డి) కమిషనరేట్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని వాసులకు అందుబాటులో ఉండి, వారికి మరింతగా సేవలు అందించాలనే లక్ష్యంగా తాడేపల్లిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయంలో అన్ని వసతులు, హంగులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ అదనపు కమిషనర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.