ఆంధ్రప్రదేశ్‌

రౌడీయిజం పునాదులపై వచ్చిందే వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 22: వైసీపీ నాయకులు రౌడీ రాజకీయాలంటూ నిరసనలు తెలపటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, అసలు ఆ పార్టీయే రౌడీయిజం పునాదులపై వచ్చిందని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. రౌడీ రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని శుక్రవారం ఆమె ఇక్కడ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తండ్రి మరణానంతరం అధికారం కోసం శవ రాజకీయం చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి అధికారులను బెదిరించి రౌడీల్లా ప్రవర్తించారంటూ విమర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైకాపా ఎమ్మెల్యే రోజా రౌడీ అని సంబోధించడం సిగ్గుచేటని ఖండించారు. వైసీపీ నాయకులు విమర్శించినట్లు చింతమనేని ప్రభాకర్ రౌడీ అయితే ప్రజాక్షేత్రంలో రెండుసార్లు ఎలా గెలిచారో చెప్పాలంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒక్క కేసు కూడా లేదనే విషయాన్ని రోజా తెలుసుకోవాలని అనిత హితవు పలికారు.