ఆంధ్రప్రదేశ్‌

ధైర్యంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపగుంట/గోపాలపట్నం, జూలై 25: దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా ఉండాలని వాయుసేన విమాన ప్రమాద కుటుంబాలకు వైకాపా అధినేత జగన్ ధైర్యం చెప్పారు. సోమవారం వేపగుంట, అప్పన్నపాలెం ప్రాంతాల్లోని గంట్ల శ్రీనివాస్, బి. సాంబమూర్తి కుటుంబాలను పరామర్శించారు. బాధితులు మనోవేదనతో జగన్ ముందు విలపించారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, తైనాల విజయకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఉన్నారు. గోపాలపట్నంలో ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధ్యక్షుడు జగన్ సోమవారం పరామర్శించారు. ముందుగా 104 ఏరియాలోని భూపేందర్‌సింగ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భూపేంద్రసింగ్ భార్య సంగీత, కుమారుడు అశుతోష్‌లను ఓదార్చారు. అక్కడి నుండి బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను, గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశరమ్మను ఓదార్చారు. గోపాలపట్నం శ్రీనివాస నగర్ ప్రాంతానికి చెందిన పాటి నాగేంద్రరావు భార్య పూర్ణిమ, తండ్రి ప్రకాశరావు తదితర కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.

చిత్రం.. గోపాలపట్నం, శ్రీనివాసనగర్‌లోని బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్న జగన్