ఆంధ్రప్రదేశ్
20న జరిగే పౌర్ణమి గరుడ సేవ రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తిరుపతి, మార్చి 18: ఈ నెల 20న పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 16వ తేదీ నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా బుధవారం నాటి పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు.
శ్రీసిటీకి సీఎఫ్ఓ అవార్డు
వరదయ్యపాళెం, మార్చి 18: శ్రీసిటీ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన వార్షిక సీఎఫ్ఓ లీడర్షిప్ కన్క్లేవ్లో టాప్ 100 సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషినల్స్ ఇన్ ఇండియా అవార్డును ఏపీలోని శ్రీసిటీ పారిశ్రామికవాడకు ప్రకటించారు. శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్.నాగరాజన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యానిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందడం తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు.