ఆంధ్రప్రదేశ్‌

కడప నుండే వైసీపీని భూస్థాపితం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 19: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కడప గడప నుంచే భూస్థాపితం చేస్తాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ ఒక నేరస్థుడు. మోదీ నేరస్తులను కాపాడుతున్న కాపలాదారు. జగన్ ఫ్యాన్ ఇక్కడ, దాని స్విచ్ కేసీఆర్ దగ్గర, కరెంట్ ఇవ్వాల్సింది మోదీ’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కడప నగరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో బాబు మాట్లాడుతూ జగన్, కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. సమావేశానికి భారీగా హాజరైన కార్యకర్తలను చూస్తుంటే ఈ జిల్లా నుండే తెలుగుదేశం అన్నిస్థానాలు గెలిచే సంకేతం కనిపిస్తోందన్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎక్కడా రాజీపడలేదని, పార్టీ జెండాలు మోసే కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటానన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు పిలుపునిస్తే తనను నమ్మి రైతులు 32 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారన్నారు. అన్ని నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువులేకుండా తరిమికొడతామని, ఇక్కడ పండించిన ధాన్యాన్ని ప్రపపంచమంతా తినాలని చంద్రబాబు అన్నారు. కోడికత్తి పార్టీవి అన్నీ నాటకాలేనని అన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కరుడుగట్టిన నేరస్థుడని విమర్శించారు. సొంత చిన్నాన్నను క్రూరంగా హత్య చేయించారని, లోటస్ పాండ్‌లోని జగన్‌కు తెలియకుండా ఈ హత్య జరిగి ఉంటుందా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వివేకా హత్య కళ్లకు కనిపిస్తుంటే గుండెపోటుతో మరణించారని కథలు సృష్టించారన్నారు. హత్యను బయటకు తేవద్దని ఎస్పీని అభ్యర్థించారని చంద్రబాబు విమర్శించారు. వివేకా దేహంపై రక్తపుమరకలు తుడిచి జగన్ మామ డాక్టర్‌గా ఉండి దెబ్బలకు కట్టుకట్టారని చంద్రబాబు అన్నారు. చనిపోయేముందు లేఖ రాసినట్లు సృష్టించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే సామాన్యులకు రక్షణ ఉంటుందా అంటూ ప్రశ్నించారు.
పరిటాల రవిని హత్య చేశారని, 110 మంది కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకేసును దర్యాప్తు చేసేందుకు పోలీసు అధికారులు సైతం భయపడుతున్నారంటే, పులివెందుల నాయకుల రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో తలచుకుంటే తనకే ఆందోళనగా ఉందన్నారు. ఇటువంటి నేరస్థులను మోదీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయన ఇంటికి తన ఇల్లు ఎంతదూరమో, తన ఇంటికి ఆయన ఇల్లు అంతేదూరమన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.