ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు కుటిల రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బీసీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వదని, తాము టిక్కెట్లు ఇస్తే ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆమె బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. తమ పార్టీ తరఫున హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ పోటీ చేయనున్నారని తెలుసుకున్న టీడీపీ ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. గోరంట్ల మాధవ్ ప్రభుత్వ ఉద్యోగానికి సమర్పించిన రాజీనామాను ఆమోదించకుండా నామినేషన్ దాఖలు చేయడానికి వీలు లేకుండా అడ్డుపడిందని ఆమె విమర్శించారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. హత్య కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి డిమాండ్ చేశారని ఆమె గుర్తు చేశారు.