ఆంధ్రప్రదేశ్‌

పెద్దమొత్తంలో ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.హీరేహాల్, జూలై 28 : కడప జిల్లా నుంచి బళ్ళారి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అనంతపురం జిల్లా పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. డి.హీరేహాల్ మండలం ఓబుళాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న 120 ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు 20 మంది కడప జిల్లా కమలాపురం నుంచి లారీలో ఎర్రచందనం దుంగలను తరలించారు. ఈలారీ కర్నూలు జిల్లా ఆలూరు, కర్నాటక రాష్ట్రం బళ్లారి మీదుగా వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. ముందు, వెనుక ఎస్కార్ట్‌తో బయలుదేరిన లారీని చిత్తూరు జిల్లా టాస్స్‌ఫోర్స్ పోలీసులు వెంబడించారు.