ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఎప్పుడైనా కేంద్రాన్ని ప్రశ్నించారా?: యామినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా విఫలమైన జగన్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఎప్పుడూ ప్రశ్నించలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక సమీపంలోని మీడియాపాయింట్‌లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జిల్లాలకు వెళ్లినప్పుడే జగన్‌కు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపడం ప్రథమ కర్తవ్యమని, అయినా తన కర్తవ్యాలను మరచిపోయి ఎన్నికల సమయంలో శుష్క వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు రాష్ట్రప్రభుత్వం చేసిన సాయం గురించి తెలుసుకోకుండా మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. సొంతజిల్లా కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై ఒక్కసారి కూడా జగన్ మాట్లాడలేదని, ముఖ్యమంత్రి అయితేనే అమరావతికి వస్తానని లోటస్‌పాండ్‌లో కూర్చున్నారని ధ్వజమెత్తారు.