ఆంధ్రప్రదేశ్
‘చంద్రబాబు సంపద సృష్టిస్తే జగన్ దోచుకుంటారు’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 March 2019
గుంటూరు, మార్చి 25: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించి పేదలకు పంచుతారని, ప్రతిపక్ష నేత జగన్ అందుకు విరుద్ధంగా ఆ సంపదను దోచుకుతింటారని టీడీపీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జగన్ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశమేనన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలను మేనిఫెస్టో కమిటీ రూపొందించిందన్నారు.