ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ మూడు పార్టీల ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదిక మీడియా పాయింట్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని, అవసరమైతే బీజేపీతో తాను జతకడతానని జగన్ అంటుండగా, కేసీఆర్, జగన్‌లు మాకు మిత్రులేనని పియుష్ గోయల్ అంటున్నారని, దీంతో వారంతా ఒక్కటేనని తేటతెల్లమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసేందుకు కేసీఆర్ పన్నుతున్న కుట్రలకు జగన్ మీడియా వంతపాడుతోందన్నారు. పట్టిసీమ, రాజధాని నిర్మాణాన్ని కూడా జగన్ వ్యతిరేకించారని, ఇందుకోసం కోర్టుల్లో కూడా కేసులు వేయించిన చరిత్ర వైసీపీదన్నారు. పోలవరానికి కేంద్రం నుండి రావాల్సిన 4 వేల కోట్ల రూపాయల నిధులను రాకుండా బీజేపీతో కలిసి జగన్ అడ్డుకున్నారని ఆరోపించారు.