ఆంధ్రప్రదేశ్
కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 April 2019
విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి చైర్మన్ చాంబర్లో బుధవారం ఎమ్మెల్సీగా అశోక్బాబు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ తన చాంబర్లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలి నిబంధనల పుస్తకాలను షరీఫ్ అందచేశారు. ఈసందర్భంగా అశోక్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏళ్ల తరువాత ఉద్యోగ సంఘాల నుంచి తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారన్నారు. ఈవీఎంలపై తన పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడే వస్తారని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందేనన్నారు.