ఆంధ్రప్రదేశ్‌

వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయంలో ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సోమవారం అంకురార్పణ జరుగనుంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపడతారు. ఈనెల 23 ఉదయం 7 నుంచి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీ వరకు భక్తులను స్వామి దర్శనానికి అనుమతించరు. ఈనెల 27వ తేదీ ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.