ఆంధ్రప్రదేశ్‌

కృష్ణపట్నం పోర్టులో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: శ్రీలంకలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 125 తీరప్రాంత గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కృష్ణపట్నం పోర్ట్, షార్‌లలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తీరప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీస్, మెరైన్ పోలీస్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి తీరప్రాంతం, సముద్రంలో గస్తీని ముమ్మరం చేశారు. తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపు వచ్చే బోట్లపై పూర్తి నిఘా ఉంచినట్లు తీరప్రాంత భద్రతా అధికారి ఒకరు తెలియచేశారు.