ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 23: ఆంధ్ర రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. సాదారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సాధారణం కంటే కూడా రెండు నుంచి మూడు డిగ్రీల మేర అదనపు ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఇప్పుడు అవి తగ్గుముఖం పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి తెలియజేసింది. ఏపీలో మంగళవారం పలుచోట్ల నమోదైన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గడంతో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టింది. కళింగపట్నం-33 డిగ్రీల ఉష్ణోగ్రతలుండగా, వాల్తేరు-35, విశాఖ విమానాశ్రయం-37, తుని-36. కాకినాడ-36, నర్సాపూర్-35, అన్నవరం-40, మచిలీపట్నం-37, జగంమహేశ్వరపురం-39, అమరావతి-39, బాపట్ల-35, ఒంగోలు-37, కావలి-37, నెల్లూరు-39, తిరుపతి-40, కర్నూలు-41, అనంతపూర్-39 డిగ్రీల మేర నమోదయ్యాయి. కాగా మధ్య భారతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున రానున్న 24 గంటల్లో ఏపీ, కోస్తాంధ్రాలో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి పేర్కొంది.