ఆంధ్రప్రదేశ్‌

కలియుగ దైవాన్ని కూడా స్వప్రయోజనాలకు వాడుకుంటున్న వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 23: కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకునే నీచస్థితికి వైసీపీ నాయకులు దిగజారారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రం, ఏడుకొండల స్వామిపై అసత్యారోపణలు చేయడం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ తిరుమల తిరుపతి దేవస్థానంపైనా, ప్రభుత్వంపైనా అసత్యారోపణలు చేయడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. స్వామివారి బంగారం తరలింపుపై దుష్ప్రచారం చేశారని, దానికి ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. టీటీడీ బంగారానికి సంబంధించిన పత్రాలు, బంగారాన్ని కుదువ పెట్టుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద ఉంటాయన్న విషయం తెలిసికూడా వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. గతంలోకూడా దేవస్థానంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని, స్వామివారి ఆభరణాలు మాయం అయ్యాయని దుష్ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరవలేదన్నారు.