ఆంధ్రప్రదేశ్‌

టీడీడీపై వైకాపా దుష్ప్రచారం: కేఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: టీటీడీపై వైకాపా నేత విజయసాయిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. బ్యాంక్ నుంచి బంగారం తరలింపుపై వైకాపా నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. స్వామివారి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం చాలాకాలంగా అమల్లో ఉన్న ప్రక్రియ అని, అయితే స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఖండించారు. రవాణాలో బంగారం భద్రత బాధ్యత ఆ బ్యాంక్‌దేనని స్పష్టం చేశారు. దీన్ని బంగారం దొంగతనానికి ప్రణాళిక అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన బుద్ధి బయటపడిందని విమర్శించారు. 13 చార్జిషీట్లలో ఏ-2 నిందితుడి నుంచి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయనుకోవడం దండగని వ్యాఖ్యానించారు. నేరగాళ్లకు నేరభాషే తప్ప దైవ భాష ఎలా వస్తుందని బుధవారం ఒక ప్రకటనలో కేఈ ఎద్దేవా చేశారు.