ఆంధ్రప్రదేశ్‌

మరో 36 గంటల్లో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు ఆగ్నేయంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని అంచనావేస్తున్నట్టు వెల్లడించారు. తీవ్ర వాయుగుండం శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.