ఆంధ్రప్రదేశ్
27 అర్ధరాత్రి వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 May 2019
విజయవాడ, మే 21: దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ నెల 27 అర్ధరాత్రి వరకూ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితిలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాక కూడా రీపోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్నారు. ఏదైనా ఈవీఎం మొరాయిస్తే, వీపీ ప్యాట్ లెక్కలో తేడా వస్తే, మిగతా ఓట్ల లెక్కింపులో పార్టీల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంటే రీపోలింగ్కు ఈసీ ఆదేశించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.