ఆంధ్రప్రదేశ్
హింసే వైకాపా నైజం: వేమూరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 May 2019
విజయవాడ, మే 22: ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఆరోపించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గెలుపు అవకాశాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఎలాంటి దురాగతాలకైనా పాల్పడి గెలవాలన్న తలంపుతో ఆ పార్టీ ఉందని ఆరోపించారు. ఆ పార్టీ చేసే దుర్మార్గాలను టీడీపీపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వైకాపా కుట్రలను తిప్పికొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలింగ్ సమయంలో వైకాపా పాల్పడిన విధ్వంసాలు, దాడులను గుర్తుంచుకుని, ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.