ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు టీటీడీ వేదపండితుల ఆశీర్వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 24: ముఖ్యమంత్రిగా ఈనెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనాలు అందజేశారు. టీటీడీ ఈఒ అశోక్‌సింఘాల్, తిరుమల ఆలయ అర్చకులు డాలర్ శేషాద్రి తదితరులు జగన్‌కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భవిష్యత్‌లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయ ఈఒ కోటేశ్వరమ్మ, ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా జగన్‌ను కలుసుకుని ఆశీర్వదించారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని బహుకరించారు. ఆలయాల నిర్వహణపై జగన్ ఈవోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించరాదని కోరారు.