ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మే 24 : రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా గెలవకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పటికీ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కేంద్రంతో చర్చించాలన్నారు. అలాగే రాష్ట్భ్రావృద్ధికి అవసరమైన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అందిస్తుందన్నారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆశించినా ప్రజలను నిరాశకు గురి చేసిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి తగిన సహకారం అందించి ఆదుకోవాలని రఘువీరా కోరారు. కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటాలతో ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.