ఆంధ్రప్రదేశ్‌

గ్రూప్స్‌కు స్క్రీనింగ్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎపిపిఎస్‌సి) ఆధ్వర్యంలో జరిగే గ్రూప్-2, గ్రూప్-3 రిక్రూట్‌మెంట్లకు సైతం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆంధ్రాలో 10 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందులో 4,009 పోస్టులను ఎపిపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. మరో 5,991 పోస్టులకు ఎపి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయనున్నారు. అభ్యర్ధుల సంఖ్య 25 వేలు దాటినపుడు కేవలం ఒకే అంచె పరీక్ష వల్ల ఎంపిక ఇబ్బంది అవుతుందని భావించిన ఎపిపిఎస్‌సి తాజాగా రెండంచెల పరీక్ష విధానాన్ని ప్రతిపాదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం జీవో 150 విడుదల చేసింది.