ఆంధ్రప్రదేశ్‌

19న ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 13: ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్ష ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ కే సంధ్యారాణి గురువారం తెలిపారు. పరీక్ష ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు జరుగుతుందని, మొత్తం 4,446 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోను ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.