ఆంధ్రప్రదేశ్‌

వైకాపా దాడులు కిరాతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపా చేస్తున్న కిరాతక దాడులను టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఆ మేరకు తీర్మానం ఆమోదించింది. విజయవాడలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వైకాపా దాడుల్లో 5 మంది కార్యకర్తలను కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు అన్ని విధాల చేయూత ఇచ్చేందుకు తీర్మానించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలో అంగన్‌వాడీ భవనాన్ని కూలుస్తుంటే అడ్డుకున్న రాజప్ప యాదవ్‌ను అత్యంత కిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపడాన్ని ఖండిస్తున్నామని, అడ్డుకున్న యాదవ్ సోదరులు ఐదుగురిని కూడా నరకడంతో తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. ఆ కుటుంబానికి పార్టీ సంఘీభావం తెలియ చేసింది. వివిధ జిల్లాల్లో 5 హత్యలు, 73 భౌతిక దాడులు, 25 ఆస్తుల విధ్వంసం చేయడాన్ని ఖండించింది.