ఆంధ్రప్రదేశ్‌

నేడు విశాఖ శారదాపీఠ శిష్య సన్యాస దీక్షా మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: కృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శనివారం విశాఖ శ్రీశారదాపీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసదీక్షా స్వీకార, పట్ట్భాషేక మహోత్సవ వేడుకలు జరుగబోతున్నాయి. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దివ్యాశీస్సులతో 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల కోసం వేలాది మంది భక్తులు విచ్చేయనున్నందున విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధం చేశారు.