ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ ప్రసంగంలోని అంశాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర శాసనసభ నుద్దేశించి గవర్నర్ ప్రసంగంలోని హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్ట హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 5ఏళ్లుగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం హామీల పూర్తి అమలు కోసం అఖిలపక్షాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, సాధించేందుకు కృషి చేయాలని రామకృష్ణ కోరారు.