ఆంధ్రప్రదేశ్‌

ట్రిపుల్ ఐటీల ప్రవేశాల్లో 0.4 యాడ్ స్కోర్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ట్రిపుల్ ఐటీల ప్రవేశాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 0.4 యాడ్‌స్కోర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పెనుమాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వినతిపత్రం సమర్పించారు. విడుదలైన నోటిఫికేషన్‌లో 0.4 యాడ్‌స్కోర్ గురించి ప్రస్తావన లేదని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసి న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఈ అంశాన్ని అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు లక్ష్మణరావు తెలిపారు.