ఆంధ్రప్రదేశ్‌

ఆ బిచ్చగాడు లక్షాధికారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూన్ 26: అనారోగ్యంతో మృతి చెందిన బిచ్చగాడి వద్ద లభించిన లక్షల రూపాయలు చూసి అటు పోలీసులు, ఇటు ప్రజలు అవాక్కయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో బుధవారం జరిగింది. దర్గావద్ద బిచ్చమెత్తుకునే బషీర్‌సాబ్(75) అనారోగ్యంతో మృతి చెందాడు. అతని వద్ద ఉన్న సంచిలో ఏకంగా రూ.3,22,670 లభించాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బషీర్‌సాబ్(75) నాలుగేళ్ల క్రితం గుంతకల్లుకు వచ్చాడు. పాత గుంతకల్లులోని మస్తాన్‌వలి దర్గా వద్ద బిచ్చమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. నాలుగు రోజులుగా బషీర్‌సాబ్ ఆరోగ్యం దెబ్బతినడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ టుటౌన్ పోలీసులు శవాన్ని తరలించేందుకు బుధవారం దర్గావద్దకు చేరుకున్నారు. శవం పక్కన ఉన్న బ్యాగు నుంచి నోట్లు బయపడటంతో అక్కడున్నవారంతా విస్తుబోయారు. ఆ బ్యాగులో ఏకంగా రూ. 3,22,670 నగదు లభ్యమైంది. ఇంత డబ్బు ఉన్నా వైద్యం చేయించుకోలేక మృత్యువాతపడ్డ బషీర్‌సాబ్ దుస్థితిని చూసి తోటి బిచ్చగాళ్లు, స్థానికులు కంటతడిపెట్టారు. శవాన్ని అంత్యక్రియల నిమిత్తం తరలించారు.

చిత్రం... బిచ్చగాడి వద్ద ఉన్న సంచిలో లభ్యమైన నగదు