ఆంధ్రప్రదేశ్‌

అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 26: కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని, అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేనాని తొలిసారిగా స్పందించారు. బుధవారం గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదికతోనే ఆపకుండా అనుమతి లేని మిగిలిన భవనాలను కూడా కూల్చివేయాలని సూచించారు. అనుమతి లేని అన్ని భవనాలను కూల్చివేస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు. కరకట్టపై 60కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రులు చెప్తున్నారని వాటిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. వీటన్నింటినీ ప్రజావేదికను కూల్చినట్లుగానే పూర్తిగా తొలగించాలన్నారు. ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని, తన తుదిశ్వాస విడిచే వరకు ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు.

చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్