ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ సేవలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 9: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను మంగళవారం ఉదయం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు అమ్మవారి దివ్య ఆశీస్సులు, ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రాక సందర్భంగా పోలీస్ అధికారులు ఆలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్యశిఖామణి అవధూతగిరి అమ్మవార్లను సైతం ఆయన దర్శించుకున్నారు. ఎస్పీఎఫ్ కమాండర్ కె నరసింహారావు దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. వీరికి ఈవో అమ్మవారి చిత్రపటం, ఆలయ క్యాలెండర్, అమ్మవారి శేషవస్త్రం, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు.

చిత్రం...ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ ఈవో కోటేశ్వరమ్మ