ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో అందుబాటులోకి పద్మనాభ నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 11: తిరుమలలో ఆర్టీసీ బస్టాండు వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయమైన పద్మనాభ నిలయాన్ని గురువారం భక్తులకు కేటాయించేందుకు టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. రిసెప్షన్2 ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈఓ పార్వతి, ఎస్ ఇ2 రామచంద్రారెడ్డి ఈ మేరకు పూజలు నిర్వహించి భక్తులకు కేటాయించారు. ఇదివరకు ఈ సముదాయంలో శ్రీవారి సేవాసదన్ కార్యాలయం నిర్వహించే వారు. ఇటీవల శ్రీవారి సేవకులకు కల్యాణ వేదిక వెనుకవైపు నూతన శ్రీవారి సేవాసదన్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా పద్మనాభ నిలయంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో మూడు విశాలమైన హాళ్లు ఉన్నాయి. దాదాపు 816 లాకర్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, తాగునీరు, ఎల్ ఈ డి టీవీలు, డిస్‌ప్లే బోర్డులు, స్ర్తిలు, పురుషులకు వేర్వేరుగా 70 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 51 మంది పారిశుద్ద్య సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. పద్మనాభ నిలయంలో పూజల అనంతరం బెంగళూరుకు చెందిన వినయ్‌కు మొదటి లాకర్ కేటాయించి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఇ ఇ మల్లికార్జున ప్రసాద్, డిప్యూటీ ఇ ఇ విశాలాక్షి, ఏ ఈ ఓలు నారాయణ, మోహన్‌రాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.