ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం మరుపురాని ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, జూలై 14 : ‘అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం’ అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణానికి వచ్చిన మంత్రి బుగ్గనకు ఘన స్వాగతం లభించింది. తొలుత మంత్రి బుగ్గనను పట్టణంలో ఊరేగించారు. అనంతరం మంత్రి బుగ్గన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు బడ్జెట్‌లో న్యాయం చేశామన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, రైతులకు పంటల బీమా పథకాలతో పాటు నారుూ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు, ఆటోడ్రైవర్లకు ఏటా రూ. 10వేలు ఇచ్చే పథకాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఎంతో తక్కువ మందికి లభించే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం ఎన్నటికీ మరువలేనిదన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన డోన్ ప్రజల రుణమెన్నటికీ మరువలేనని, వారి రుణం తీర్చుకుంటానన్నారు.
చిత్రం...డోన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన