ఆంధ్రప్రదేశ్
అరకులో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 July 2019
న్యూఢిల్లీ, జూలై 19: అరకులో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ లోక్సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి కేంద్రాన్ని కోరారు. లోక్సభ జీరో అవర్లో మాధవి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గిరిజన ప్రాంతమైన అరకులో పసుపు, పనస, అనాస, జీడిపప్పు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతాయని ఆమె అన్నారు. ఉత్పత్తులను నిల్వఉంచుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని మాధవి విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు చేయడం వల్ల అరకు నియోజకవర్గంలో గిరిజనులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు.