ఆంధ్రప్రదేశ్‌

జి. మాడుగుల మండలంలో మావోల నల్లజెండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగల, ఆగస్టు 15: విశాఖ జిల్లా జి.మాడుగల మండలంలోని పలు ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవంరోజు ఎగరాల్సిన జాతీయ జెండాలకు బదులు నల్ల జెండాలు రెపరెపలాడాయి. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో మండలంలో ఎక్కడా త్రివర్ణ పతాకం రెపరెపలాడ లేదు. బొయితిలి ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఆదివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు నల్ల జెండాను ఎగరవేసారు. పాఠశాలలో జెండావందనం చేయవద్దని పాఠశాలలో వున్న ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ చేశారు. జక్కోం, సుర్తిపల్లి, బొయితిలి, లువ్వపల్లి, చెక్కరాయి, కిల్లంకోట, బోంగరం, అమిడేలు గ్రామాల్లో కూడా మావోలు నల్ల జెండాలు ఎగురవేయడంతో ఈ ప్రాంతాల్లో సోమవారం జాతీయ జెండా ఎగరలేదు.

చిత్రం.. బొయితిలి ఆశ్రమ పాఠశాల ఆవరణలో మావోయిస్టులు ఎగురవేసిన నల్ల జెండా