ఆంధ్రప్రదేశ్‌

నిబద్ధతకు నిలువుటద్దం కోనేరు: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 17: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు నాగేశ్వరరావు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్‌లో దివంగత నేత కోనేరు నాగేశ్వరరావు సంతాప సభ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కోనేరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించిన అనంతరం నారాలోకేష్ మాట్లాడుతూ 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోనేరు శాసన సభ్యునిగా, మంత్రిగా ప్రజలకు ఆదర్శనీయమైన రీతిలో సేవలందించారన్నారు. నిబద్ధతకు నిలువుటద్దంగా ప్రజల మన్ననలు పొందారన్నారు. కోనేరు ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కోనేరు నాగేశ్వరరావు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా రాజకీయ భవిష్యత్‌ను అందించిన తెలుగుదేశం పార్టీలోనే తుది శ్వాస వరకు ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మాజీమంత్రులు మండవ వెంకటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, జలగం ప్రసాదరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం.. కోనేరు సంతాపసభలో మాట్లాడుతున్న నారా లోకేష్