ఆంధ్రప్రదేశ్‌

ఇతర ప్రాంతాల్లో డ్రోన్లు ఎందుకు వదలలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 16: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్లు వదిలిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లు వదిలామని చెప్తున్న ప్రభుత్వం ఇతర ప్రాంతాలను ఎందుకు చిత్రీకరించలేదని ప్రశ్నించారు. వరద పరిస్థితిని పక్కనపెట్టి సమీక్షలు జరపకుండా, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతా రాహిత్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారని విమర్శించారు.
రద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, కట్టుబట్టలతో నిర్వాసితులవుతున్న ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ వరద రాజకీయాలు చేస్తోందనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలు మానుకుని ప్రజల భద్రతపై ప్రభుత్వం స్పందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.