ఆంధ్రప్రదేశ్‌

బీజేపీలోకి యామినీ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 18: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆ పార్టీని వీడి ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొద్దికాలంలోనే వార్తల్లో నిలిచిన యామినీ శర్మ బీజేపీలో చేరడం తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నుండి వలసలు కొంతమేర తగ్గిన నేపథ్యంలో తాజాగా యామినీ శర్మ బీజేపీలో చేరడం గమనార్హం. మరికొంత మంది తెలుగుదేశం, వైసీపీ నాయకులు తమ పార్టీలో చేరనున్నారని బీజేపీ నేతలు చెపుతున్నారు.