ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాల్లో నేడు చంద్రబాబు పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
విజయవాడ, ఆగస్టు 19: కృష్ణా జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిండిపోయి భారీగా వరద నీరు రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి చేరింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక దశలో దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో 46 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంటలకు, ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. తీవ్ర అవస్థల పాలైన ప్రజలను, పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.