ఆంధ్రప్రదేశ్
త్వరలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నియయాకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
ఒంగోలు, ఆగస్టు 19: త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్కు చైర్మన్ను నియమిస్తారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. సోమవారం అనంతపురం నుండి బాపట్లవెళ్తూ మార్గమధ్యంలో ఒంగోలులోని ఎన్ఎస్పి అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గసభ్యులు కొంతసేపు కోనతో మాట్లాడారు. ముఖ్యమంత్రి బ్రాహ్మణ కార్పొరేషన్ను బలోపేతం చేస్తారని తద్వారా పేదబ్రాహ్మణులకు చేయూతనందిస్తారని తెలిపారు. ముందుగా ఒంగోలు ఆర్డీఒ పెంచలకిశోర్ కోనకు స్వాగతం పలికారు.